అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబీహా గౌసుధిన్ గారు.
అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారి మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా..
కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, గురువారం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మిక్కిలి మాను చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు సమస్యలపై కలెక్టర్ గారితో చర్చించారు. ముఖ్యంగా:
అల్లాపూర్ డివిజన్లో నూతన అంగన్వాడి సెంటర్ల స్థాపన
పర్వత్ నగర్ ప్రైమరీ స్కూల్ కు అదనపు అంతస్తు నిర్మాణం
పర్వత్ నగర్ ప్రభుత్వ పాఠశాల, అల్లాపూర్ తెలుగు మీడియం స్కూల్, అల్లాపూర్ ఉర్దూ మీడియం స్కూల్, కొత్తూరు సీతయ్యనగర్ తెలుగు మీడియం స్కూల్ అభివృద్ధిపై చర్యలు
పర్వత్ నగర్ లోని ఇళ్లకు జీవో 59 కింద పట్టాలు మంజూరు చేయాలని
నూతన పెన్షన్లు సాంక్షన్ చేయాలని
రాజీవ్ గాంధీ నగర్, సబ్ధర్ నగర్ లలో ఇంటి నెంబర్లు కల్పించాలని
రాజీవ్ గాంధీ నగర్ లో ని బస్తీ దవాఖానకు ప్రసవానికి వస్తున్న మహిళలకు బాలానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించే క్రమంలో బాలనగర్ దూరం కావటం వలన గర్భిణీలకు ఇబ్బందికరంగా మారుతుంది. కావున పర్వత్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి రాజీవ్ గాంధీ నగర్ సబ్ధర్ నగర్ కు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పర్వత్ నగర్ అని అన్నారు. పర్వత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలను తీసుకునే అనుమతులివ్వాలని తెలిపారు.
సర్వే నెంబర్ 18 వద్ద తెలుగు మరియు ఉర్దూ మీడియం హైస్కూల్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని
ఈ అంశాలపై వినతిపత్రాలను కలెక్టర్ గారికి అందజేశారు.