కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా అభిప్రాయ సేకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో నూతన కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు..

కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలను గుండెలో పెట్టుకునే పార్టీ కాబట్టి కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కోరారు..

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రపంచానికె ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు..
పార్టీ పదవులు అందిన, అందకపోయినా పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉండి గుర్తింపుని ఇస్తుందన్నారు..
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహిళ నాయకులు,బ్లాక్ నాయకులు, డివిజన్ నాయకులు, మున్సిపల్ పరిధి నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply