ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు..MLA మాధవరం కృష్ణారావు గారు
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయానికి నియోజకవర్గానికి చెందిన మహిళలు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు … ముఖ్యంగా నియోజకవర్గంలో మంచినీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నామని… గత పదేళ్ల కాలంలో మంచినీటికి ఎప్పుడు ఇబ్బంది పడిన దాఖలాలు లేవని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిందెలతో ఏ విధంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందో… ఇప్పుడు అలాగే ఉందని.. అంతేకాకుండా ప్రభుత్వం మంచినీరు సరఫరా చేయక, తమ బోరులు వేసుకుంటే అవి కూడా తీసుకెళ్లిపోయి అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని… తాము ఎలా బతకాలని విలపించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ… ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా అందనీయకుండా వారిపై ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబుఅని… వారికి మంచినీరు ఇవ్వక.. వారు వేసుకున్న బోర్లను తీసుకెళ్లిపోయి.. మీరేమో నీళ్ల ట్యాంకులను బయటకు అమ్ముకుంటారని అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు… ఇదే పరంపర కొనసాగితే మంచినీటి సరఫరా కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుందని.. తక్షణమే ఇటువంటి చర్యలు ఉపసంహరించుకోవాలని.. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హెచ్చరించారు…