ఏపికి రైల్వేలైన్ ప్రాజెక్టుకు 1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.1,332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
“ఈ ప్రాజెక్టు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటను అనుసంధానం చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వైద్యం, విద్యా రంగాల్లో వెల్లూరు, తిరుపతికి మరింత ప్రాధాన్యత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఏపీలోని సిమెంట్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైన్ కనెక్టివిటీలో నూతన శకానికి నాంది పలికినట్లు అవుతుంది” అని చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

Leave a Reply