నల్లగుట్ట శివాలయంలో 24వ శివ మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నల్లగుట్ట శివాలయంలో దూదిమెట్ల సోమేశ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సుమారు 50మంది శివస్వామిలు కాలినడకన నల్లగుట్ట నుండి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరుతున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు శివస్వాములకు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు… అనంతరం కూన శ్రీశైలం గౌడ్ గారు.. నల్లగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,శివాధారణ చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…– నల్లగుట్ట శివాలయం నుండి 50 మంది శివస్వాములు కాలినడకన శ్రీశైలంకు బయలుదేరడం మంచి శుభపరిణామం అన్నారు..

— శివ స్వాములు 41 రోజులు ఉపవాస దీక్షలు పూర్తిచేసుకుని పాదయాత్రగా వెళ్ళడం సంతోషంగా ఉందన్నారు..
— శివయ్య,మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై,శివ స్వాముల కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు..
ఈ కార్యక్రమంలో దూదిమెట్ల సోమేశ్ యాదవ్, యాదిలాల్, పెంటయ్య, కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, శివ స్వాములు, భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు..