స్మశాన వాటికలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి, కావాల్సిన నిధులు కోరకు అంచన

సోమ వారం నాడు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో నియోజకవర్గంలో స్మశాన వాటిక లన్ని పరిశీలించాము అని, 60% శాతం పనులు పూర్తయ్యాయి, అన్ని స్మశాన వాటికల్లో బాలన్స్ పనులు పూర్తి చేయాలని ఇంకా నిధులు కావాలంటే అంచనాలు తయారు చేసి నాకు అందజేయాలని యం.ఎల్.ఎ గారు అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రములో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, యం. సబిహా గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు పగడాల బాబురావు, తూము శ్రావణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు ఎస్ .సి చిన్న రెడ్డి, ఈఈ గోవర్ధన్, శ్రీనివాస్, డి .ఈ లు , ఎ.ఈ లు, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు