మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు*..
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు * తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు*
మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన మహానుభావుడు ఆయన అని పేర్కొన్నారు, దేశానికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకులు అతను తన జ్ఞానం మరియు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి చేసిన అమూల్యమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు అన్నారు,మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ శేరి సతీష్ రెడ్డి గారు సంతాపాన్ని తెలిపారు.. సంతాపం తెలియజేసిన వారిలో బి సంజీవరావు, లక్ష్మీనారాయణ, రేష్మ, రాజా ముదిరాజ్, శ్రీధర్ చారి, బాబురావు, రామకృష్ణారెడ్డి, సూరిబాబు, దుర్గా తదితరులు పాల్గొన్నారు.
